లాక్ డౌన్ కారణంగా రోజు వారి కూలీ చేసుకుని పొట్ట పోసుకునే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రతి గ్రామంలో కూడా చాలా మంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు.
ఈ సమయంలో పలువురు పలు రకాలుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు, వస్తూనే ఉన్నారు.తాజాగా మంచు ఫ్యామిలీ కూడా పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.
ఎప్పుడు కూడా మంచు ఫ్యామిలీ ఇలాంటి సమయంలో ముందు ఉండి తన సేవ గుణంను చాటుకుంటుంది.
తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గం పరిధిలో 8 గ్రామాలను దత్తత తీసుకుని ఆగ్రామాల్లో ఉన్న పేదలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.మోహన్బాబు ఇంకా ఆయన కుమారుడు విష్ణు తాజాగా చంద్రగిరి చేరుకుని అక్కడ కూరగాయలతో పాటు ఆహార పదార్థాలను 8 గ్రామాలకు అందజేసే ఏర్పాట్లు చేశారు.
ఒకటి రెండు గ్రామాలకు నేరుగా వెళ్లి కూడా కూరగాయలు అందజేయడం జరిగింది.
మంచు ఫ్యామిలీ చేస్తున్న మంచి పనిని స్థానికులు అభినందిస్తున్నారు.
రోజులు గడవని ఈ పరిస్థితుల్లో మీరు చేస్తున్న సాయం మరువలేనిది అంటూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ విపత్తు ఉన్నన్ని రోజులు కూడా ఆ 8 గ్రామాలకు సంబంధించిన పూర్తి బాధ్యతను మంచు ఫ్యామిలీ చూసుకుంటుందని మోహన్బాబు హామీ ఇచ్చాడు.