మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు వారి ఫ్యామిలీ నుంచి హీరోలు మనల్ని ఎంతగానో అలరించారు.ఇదివరకు కాలంలో మంచు మోహన్ బాబు తన నటనతో, డైలాగ్ డెలివరీ తో డైలాగ్ కింగ్ గా పేరు సంపాదించాడు.
ఆయన తర్వాత ఆయన కొడుకులు మంచి విష్ణు, మంచు మనోజ్ లు ఇద్దరు హీరోలుగా నటించగా.కూతురు మంచు లక్ష్మి విభిన్న పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
వీరిలో మంచు మనోజ్ మిగితా వారి కంటే విభిన్న కథలను ఎంచుకుని తనదైన శైలిలో నటన చేస్తూ తెలుగువారికి ఎంతగానో దగ్గరయ్యాడు.కేవలం నటన పరంగానే కాకుండా బయట కూడా తన ప్రవర్తన కారణంగా ఆయన ఎన్నో ప్రశంసలు పొందాడు.
దొంగ దొంగది సినిమా లో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన మంచు మనోజ్ చివరిసారిగా 2017 సంవత్సరంలో రిలీజ్ అయిన ఒక్కడు మిగిలాడు సినిమా లో కనిపించారు.ఆ సమయంలో కాస్త కుటుంబ సమస్యల కారణంగా కొన్ని రోజులు ఇబ్బంది పడిన మనోజ్ తర్వాత తన భార్యకు విడాకులు ఇచ్చాడు.
ఆ సంఘటన జరిగి సుమారు 3 సంవత్సరాల పాటు అటు బయట ప్రపంచానికి, ఇటు సినిమాలకు దూరంగా ఉండి పోయాడు.అలా చాలా కాలం తర్వాత అహంబ్రహ్మాస్మి సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను నిర్మించబోతున్నారు.ఈ మూడేళ్లలో హీరో మనోజ్ కాస్త లావు అయ్యాడు అని అందరికీ తెలిసిందే.ఈ విషయం అలా ఉండగా తాజాగా తన సినిమా కోసం మంచు మనోజ్ ఏకంగా 15 కిలోలు తగ్గాడు.తాజాగా తన బరువు తగ్గిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తన ట్విట్టర్ ఖాతా కు ప్రొఫైల్ పిక్ గా అతడి లేటెస్ట్ ఫోటో ను అప్డేట్ చేశాడు.వీటితోపాటు తెలుగు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫోటోను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
ప్రస్తుతం మంచు మనోజ్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇంతలో ఒక్కసారిగా మనోజ్ సన్న పడడంతో మంచు వారి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.