సీనియర్ నిర్మాత కుమారుడు సుమంత్ అశ్విన్ మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఒక సీనియర్ దర్శకుడితో చేతులు కలుపుతున్నాడు.
అతను ఎవరో కాదు.మనసంతా నువ్వే సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న విఎన్.ఆదిత్య.
2001 లో విడుదలైన ఆ సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.అయితే ఆ తరువాత వరుస అపజయలతో సతమతమైన ఆదిత్య గత 8 ఏళ్ల నుంచి మెగా ఫోన్ కి దూరమయ్యాడు.ఇక ఇటీవల నాని జెర్సీ సినిమా చూసి ఇన్స్పైర్ అయినట్లు చెబుతూ మంచి సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యాడు.
చివరగా 2011లో ఆదిత్య చేసిన సినిమా ముగ్గురు.ఆ సినిమా తరువాత మరికొన్ని కథలు రెడీ చేసుకున్నప్పటికి సెట్స్ పైకి రాలేదు.ఇక మళ్ళీ 8 ఏళ్లకు అశ్విన్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.స్క్రిప్ట్ హీరోకి తెగ నచ్చినట్లు తెలుస్తోంది.మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ దర్శకుడు ఎంతవరకు క్లిక్కవుతారో చూడాలి.