తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని “మనం సైతం” కాదంబరి కిరణ్ మర్యాద పూర్వకంగా ప్రగతి భవన్ లో కలిశారు.డిసెంబర్ 8వ తేదీన జరగనున్న తమ కుమార్తె శ్రీకృతి వివాహ మహోత్సవానికి రావలసిందిగా శ్రీ కేసీఆర్ గారిని ఆహ్వానిస్తూ, శుభలేఖను అందించారు.
ఈ సందర్భంగా “మనం సైతం” ద్వారా సమాజహితం కొరకు నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలను శ్రీ కేసీఆర్ గారికి వివరించి, వారి ఆశీస్సులను పొందారు.