కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఈమధ్యనే తన సినిమా మానాడుతో సూపర్ హిట్ అందుకున్నాడు.శింబుకి తమిళంలో సరైన హిట్ పడి చాలా రోజులు అవుతుంది.
వెంకట్ ప్రభు డైరక్షన్ లో వచ్చిన మానాడు సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కాడు శింబు.ఇదిలా ఉంటే ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్ సొంతం చేసుకున్నారు.
అయితే శింబు మానాడు తెలుగులో డబ్ అయ్యింది.రిలీజ్ చేద్దామని అనుకోగా లాస్ట్ మినిట్ ఆగిపోయింది.
తెలుగులో తనకున్న మార్కెట్ వల్ల మానాడు ది లూప్ పేరుతో తెలుగులో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు శింబు.
ఈలోగా మానాడు నిర్మాతలు సురేష్ ప్రొడక్షన్స్ కి రీమేక్ రైట్స్ అమ్మేశారు.
అయితే తెలుగులో మానాడు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేయాల్సిందే అని పట్టుబడుతున్నాడట శింబు.మన్మధ, వల్లభ సినిమాలతో తెలుగులో ఆడియెన్స్ ను మెప్పించిన శింబు మళ్లీ తన సినిమాలతో ఇక్కడ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తున్నాడు.
ఈ క్రమంలో మానాడు సినిమా తనకు తెలుగులో తిరిగి మైలేజ్ తెస్తుందని భావిస్తున్నాడు.అయితే ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో రానాతో రీమేక్ చేయాలని చూస్తున్నారు.
మరి శింబుని ఒప్పించి తీస్తారా లేక అతని సినిమానే రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి.