కొన్ని సందర్బాల్లో మనకు కలిసి వచ్చిన లక్ను మనమే నమ్మలేని పరిస్థితిలో ఉంటాం.ఏదైనా ఒక లక్కీ డ్రాలో వెయ్యి రెండు వేల రూపాయలకు సంబంధించిన వస్తువులు లేదా కూపన్లు వస్తేనే అబ్బా అనుకుని తెగ సంబరపడిపోతూ ఉంటాం.
ఇక కొందరు లక్షల్లో అప్పుడప్పుడు లక్కీ డ్రా ద్వారా దక్కించుకోవడం మనం చూస్తూ ఉంటాం.కాని కోట్లల్లో మాత్రం చాలా చాలా తక్కువగా లక్కీ డ్రాలు తలుగుతూ ఉంటాయి.
ఇక వందల కోట్ల రూపాయల లక్కీ డ్రాలు అసలు తలిగే ఛాన్స్లు ఉంటాయో ఉండవో చెప్పలేం.అలాంటిది ఏకంగా 2387 కోట్ల రూపాయల లక్కీ డ్రా ఒక వ్యక్తికి తగిలింది.
అది కూడా ఒక చిన్న బిస్కట్ ప్యాకెట్ కొంటే ఆ మొత్తం అతడికి దక్కింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… అమెరికా నార్త్ కరోలినాకు చెందిన చార్లెస్ జాక్సన్ అనే 66 ఏళ్ల వ్యక్తి తాను చేస్తున్న ఉద్యోగంకు రిటైర్మెంట్ తీసుకుని ప్రస్తుతం భార్య మనవరాళ్లతో జీవితాన్ని హాయిగా గడిపేస్తున్నాడు.ఇటీవల తన 8 ఏళ్ల మనవరాలి కోసం బిస్కట్స్ కొనుగోలు చేసేందుకు వియత్నంలోని పార్చ్యూన్ కుకీ అనే రెస్టారెంట్కు వెళ్లడం జరిగింది.అక్కడ ప్రతి వారం డ్రాలు తీస్తూనే ఉంటారు.
అయితే అక్కడ తీసే డ్రాలు ఎప్పుడు తలగడం లేదు కదా అని చార్లెస్ అప్పుడప్పుడు అనుకున్నాడట.ఈసారి కూడా తనకు డ్రా తలుగుతుందనే నమ్మకం లేదని, తన మనవరాలు బిస్కట్స్ తీసుకుని అందులో ఉన్న పేపర్ నాకు తీసుకు వచ్చి ఇచ్చింది.
ఆ పేపర్లో ఉన్న నెంబర్ చూడగానే నేను సంతోషంతో అరిచేశాను.నా సంతోషంకు అవదులు లేకుండా పోయింది.ఆ సంతోషంతో ఏం చేయాలో పాలు పోలేదు.అందులో ఏకంగా 344.6 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ఉంది.ఆ మొత్తం నాకు రాబోతుందంటే నేనే నమ్మలేక పోతున్నాను.
వారు ఆ అమౌంట్ ఇచ్చే వరకు నాకు అసలు ఏం జరుగుతుంది తెలియకుండా ఉంది.ఈ విషయంతో ప్రపంచంలోనే అత్యంత లక్కీ వ్యక్తిగా చార్లెస్ నిలిచాడు.
ఇప్పటి వరకు ఎవరికి ఈ స్థాయిలో లక్కీ డ్రాలో డబ్బులు తలిగి ఉండవు.ఒకవేళ తలిగినా వారు కొనుగోలు చేసిన వస్తువు ఖరీదు ఎక్కువ అయ్యి ఉంటుంది.
కేవలం వందల రూపాయలు కొనుగోలు చేస్తే వేల కోట్ల రూపాయల లక్కీ డ్రా తలగడం అంటే ప్రపంచంలోనే ఇదో పెద్ద చరిత్రగా చెప్పుకోవచ్చు.