దేశ రాజధాని అయిన ఢిల్లీకి ముఖ్యమంత్రి, ఎలాంటి సినీ, రాజకీయ నేపధ్యం లేకుండా సామాజిక ఉద్యమవేత్తగా రాజకీయ పార్టీ పెట్టి తక్కువ సమయంలో దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేసి ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్.అలాంటి నేపధ్యం ఉన్న వ్యక్తి మీద ఎవరికైనా గౌరవం ఉంటుంది.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎలాంటి భద్రత లేకుండా ఒంటరిగా వెళ్ళగలిగే తెగింపు కేజ్రీవాల్ సొంతం.ఇక మొదటి నుంచి బీజేపీ కి బద్ధ విరోధిగా పేరు ఉన్న కేజ్రీ వాల్ క్రేజ్ ని ఇతర పార్టీలు రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేసిన అతను ఎవరికి లొంగలేదు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే బీజేపీ సానుబూతి పరులు చాలా సార్లు బౌతిక దాడులకి ప్రయత్నం చేశారు.ఎన్నికల ప్రచార సమయాలలో అతనిని కొట్టిన సందర్భాలు ఇప్పటికే చాలా సార్లు జరిగాయి.
తాజాగా మరో సారి అతని మీద దాడి జరిగిఇంది.తాజాగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోతీనగర్ లో రోడ్ షో నిర్వహిస్తున్న కేజ్రివాల్పై గుర్తుతెలియని వ్యక్తి ఆకస్మిక దాడి చేశాడు.
కేజ్రీవాల్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో హఠాత్తుగా ఆయన వాహనం ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంపపై కొట్టారు.దాంతో ఒక్కసారే బిత్తరపోయారు కేజ్రీవాల్ అలా చూస్తూ ఉండిపోయాడు.
అయితే వెంటనే ఆ వ్యక్తిని ఆప్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.ఇప్పుడు ఈ సంఘటన మరో సారి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.