ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా నిమిషాలలో విషయం అందరికీ తెలిసిపోతుంది.దీనికి కారణం చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్, అందులో ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్ఫామ్.
ఇందులో ఈ మధ్యకాలంలో ఎక్కువగా జంతువులు పక్షులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.అలాగే కొందరు చేసే వెరైటీ చేష్టలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి.
ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ గా మారుతున్నాయి.తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారుతుంది.
ఈ వీడియోలో ఏటీఎం సెంటర్ ను ఓనర్ జ్యూస్ షాప్ గా మార్చేశాడు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.
మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.స్టేట్ బ్యాంక్ ఎటిఎం సంబంధి ప్రాంతాన్ని ఆ షాప్ ఓనర్ కాస్త జ్యూస్ సెంటర్ గా మార్చేశాడు.
దీంతో ఏకంగా జ్యూస్ షాప్ కోసం లోపల టేబుల్స్, కుర్చీలు వేసి జ్యూస్ తాగడానికి వచ్చిన కస్టమర్లకు ఏటీఎం కోసం ఏర్పాటు చేసిన ఏసీలో కూర్చోబెట్టి జ్యూస్ లను అందిస్తున్నాడు.ఇది చూసిన అక్కడి స్థానికులు అందరూ ఆశ్చర్యపాతున్నారు.
ఇది ఇలా ఉండగా కొంతమంది మాత్రం ఓనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీక్రెట్ గా ఉండాల్సిన ఏటీఎం కాస్త ఇలా పబ్లిక్ గా జ్యూస్ పాయింట్ గా మారితే ఎలా అంటూ అతనిపై మండిపడుతున్నారు.అయినా కానీ ఆ ఓనర్ ఎటువంటి బెదిరింపులకు లోనవ్వకుండా ఆ జ్యూస్ సెంటర్ ని కొనసాగిస్తున్నాడు.దీంతో ఓ నెటిజన్ ఆ షాప్ ఏటీఎం సెంటర్ సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దాంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.చూడాలి మరి ఆ బ్యాంకు అధికారులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో.