నిజంగా కొన్ని కొన్ని మాటలకు అర్ధాలు ఉంటాయి అనిచెప్పాలి.ఈ భూమి మీద నూకలు ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ప్రమాదం నుంచి అయినా సురక్షితంగా బయటపడొచ్చు అన్న విషయం ఈ తాజా ఉదంతం తో అర్ధం అవుతుంది.
నిజంగా ఈ మాటలను నిజం చేస్తూ ఒక ఛాయ్ వాలా కదిలే రైలు ఎక్కుతూ కింద పడిపోయి కూడా ఎలాంటి గాయం కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు.ఈ ఘటన ఒడిశా లోని జోహార్స గూడా రైల్వే స్టేషన్ లో మంగళవారం చోటుచేసుకుంది.
అయితే ఇప్పడు ఈ సంఘటనకు సంబందించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు నెట్టింట్లో హల్ చల్ చేస్తుండడం తో అందరూ ఆశ్చర్యపోతున్నారు.రైల్వే స్టేషన్ లో టీ అమ్మే రాజేష్ తల్వార్ అనే వ్యక్తి కదిలే రైలు ఎక్కబోతూ అనుకోకుండా కిందకు జారీ పడ్డాడు.
అంతే అతడు నేరుగా ఫ్లాట్ ఫామ్ కు రైలు కు మధ్య ఉన్న సందులో ఇరుక్కోగా అతడికి సాయం అందించడానికి పాపం ప్లాట్ ఫామ్ పై ఉన్న వ్యక్తి కూడా ప్రయత్నించాడు.
కానీ అతడు మాత్రం ఉన్నట్టుండి కిందకు జారిపోయాడు.
దీనితో ఇక అతడు రైలు పట్టాల కింద నుజ్జు నుజ్జయి ఉంటాడు అని అందరూ భావించారు.కానీ ఇక్కడే విచిత్రం సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయటపడి మామూలుగా తన పని తానూ చేసుకొంటూ పోవడం తో అక్కడ ఉన్న జనం అంతా కూడా నోరెళ్లబెట్టారు.
నిజంగా ఇలాంటి ప్రమాద సమయంలో ఎలా మెలగాలి అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది.అదే అతడు కంగారుపడి ఇంకా ప్లాట్ ఫామ్ మీదకు రావడానికి ప్రయత్నించి ఉంటే మరి ఎలాంటి అనర్ధం జరిగేదో.
కానీ ఆ సమయంలో రాజేష్ సమయస్ఫూర్తి తో వ్యవహరించడం తో ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు.
.