మృత్యువు ఒడిలో తలపెట్టి సురక్షితంగా బయటపడ్డ ఛాయ్ వాలా

నిజంగా కొన్ని కొన్ని మాటలకు అర్ధాలు ఉంటాయి అనిచెప్పాలి.ఈ భూమి మీద నూకలు ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ప్రమాదం నుంచి అయినా సురక్షితంగా బయటపడొచ్చు అన్న విషయం ఈ తాజా ఉదంతం తో అర్ధం అవుతుంది.

 Man Survives After He Fells Between Moving Train And Platform1 1-TeluguStop.com

నిజంగా ఈ మాటలను నిజం చేస్తూ ఒక ఛాయ్ వాలా కదిలే రైలు ఎక్కుతూ కింద పడిపోయి కూడా ఎలాంటి గాయం కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు.ఈ ఘటన ఒడిశా లోని జోహార్స గూడా రైల్వే స్టేషన్ లో మంగళవారం చోటుచేసుకుంది.

అయితే ఇప్పడు ఈ సంఘటనకు సంబందించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు నెట్టింట్లో హల్ చల్ చేస్తుండడం తో అందరూ ఆశ్చర్యపోతున్నారు.రైల్వే స్టేషన్ లో టీ అమ్మే రాజేష్ తల్వార్ అనే వ్యక్తి కదిలే రైలు ఎక్కబోతూ అనుకోకుండా కిందకు జారీ పడ్డాడు.

అంతే అతడు నేరుగా ఫ్లాట్ ఫామ్ కు రైలు కు మధ్య ఉన్న సందులో ఇరుక్కోగా అతడికి సాయం అందించడానికి పాపం ప్లాట్ ఫామ్ పై ఉన్న వ్యక్తి కూడా ప్రయత్నించాడు.

కానీ అతడు మాత్రం ఉన్నట్టుండి కిందకు జారిపోయాడు.

దీనితో ఇక అతడు రైలు పట్టాల కింద నుజ్జు నుజ్జయి ఉంటాడు అని అందరూ భావించారు.కానీ ఇక్కడే విచిత్రం సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయటపడి మామూలుగా తన పని తానూ చేసుకొంటూ పోవడం తో అక్కడ ఉన్న జనం అంతా కూడా నోరెళ్లబెట్టారు.

నిజంగా ఇలాంటి ప్రమాద సమయంలో ఎలా మెలగాలి అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది.అదే అతడు కంగారుపడి ఇంకా ప్లాట్ ఫామ్ మీదకు రావడానికి ప్రయత్నించి ఉంటే మరి ఎలాంటి అనర్ధం జరిగేదో.

కానీ ఆ సమయంలో రాజేష్ సమయస్ఫూర్తి తో వ్యవహరించడం తో ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube