అగ్రరాజ్యం అమెరికా అనగానే గుర్తుకు వచ్చేది వైట్ హౌస్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.ఈ రెండు అమెరికాకి కీర్తి ప్రతీకలుగా నిలిచాయి.
అమెరికా ఎవరు వెళ్ళినా సరే వీటిని సందర్శించకుండా ఉండరు.అయితే అధ్యక్షుడు కొలువు తీరే భవనం వైట్ హౌస్ అంటే అసాధారణ సెక్యూరిటీ ఉంటుంది.
ఎప్పుడూ అధునాతన టెక్నాలజీ తో వైట్ హౌస్ ని కాపలా కాస్తూ ఉంటారు.చీమ చిటుక్కు మన్నా సరే అక్కడి సెక్యూరిటీలో తెలిసిపోతుంది.అయితే
వైట్ హౌస్ సమీపంలో ఒక్క సారిగా షాకింగ్ సంఘటన జరిగింది.ఎప్పుడూ సందర్సకులతో బిజీ బిజీగా ఉండే ఎలిప్స్ పార్కులో ఓ వ్యక్తి తనకు తాను నిప్పు అంటించుకున్నాడు.అనంతరం పార్కులో పరిగెత్తుతూ కనిపించాడు.ఒక్క సారిగా మంటలు అధికంగా రావడంతో సెక్యూరిటీ గమనించి మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు చేశారు.అయితే అప్పటికే అతడి శరీరం 85శాతం కాలిపోయింది.
హుటాహుటిన సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో 85 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన భాడితుడు గురువారం నాడు చనిపోయాడు.మృతుడిని పోలీసులు అర్నవ్ గుప్తాగా గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండో సారని పేర్కొన్నారు అధికారులు.