కరోనా వైరస్ విజృంభణ ఏ రేంజ్ లో ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తుంది.
ఎటువైపు నుండి.ఏ వ్యక్తి నుండి కరోనా సోకుతుందో తెలియడం లేదు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా వైరస్ భారిన పడుతున్నారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కోటి పదిహేను లక్షలమందికిపైగా వ్యాపించింది.ఇంకా అందులో 60 లక్షలమందికిపైగా కరోనా నుండి కోలుకున్నారు.5 లక్షలమందికిపైగా మరణించారు.ఇంకా ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఓ షాకింగ్ ఘటన జరిగింది.ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.
ఒక వ్యక్తి కరోనా వైరస్ సోకింది.ఆ వ్యక్తి ఏకంగా 104 మందికి కరోనా సోకింది.
ఆశ్చర్యంగా ఉంది కదా? తమిళనాడులోని చెన్నైలో ఈ ఘటన జరిగింది.తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్లోని ఓ ఆభరణాల దుకాణంలో పనిచేసే వ్యక్తికి జూన్ 22న కరోనా పాజిటివ్ వచ్చింది.
దీంతో అతని నుంచి ఆ స్టోర్లో పనిచేసే మిగతా 303 సిబ్బంది సహా వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా 104 మందికి వైరస్ సోకినట్లు తేలింది
ఇంకా వీరిలో దాదాపు అందరూ తురైయూర్ గ్రామాలకు చెందినవారే.దీంతో అక్కడ కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.
కాగా ఆ జ్యువెలరీ షాపులో ఒక వ్యక్తి కరోనా వచ్చినప్పటికీ క్వారంటైన్కి పంపకుండా విధులు అప్పజెప్పారన్న విమర్శలు తలెత్తుతున్నాయి.ఏది ఏమైనా ఒక వ్యక్తి ద్వారా ఏకంగా 104 మందకి కరోనా వైరస్ వ్యాపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.