మానవత్వం అనేది రోజురోజుకూ నశిస్తుంది.వావివరసలు లేకుండా మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు.
తాజాగా జరిగిన ఈ సంఘటన కూడా ఇలాంటి కోవకే చెందుతుంది.ఒక వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు.
ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లిళ్లు చేసుకుని ఐదుగురి మహిళల జీవితాలను నాశనం చేసాడు.
అన్ని పెళ్లిళ్లు చేసుకున్న అతనిలో కామాంధుడు నిద్రపోలేదు.
మైనర్ బాలిక అయిన సవతి కూతురునే లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు.చాలా రోజులుగా తన కోరిక తీర్చమంటూ వేధిస్తున్నాడు.
చివరకు ఎవరూ లేని సమయంలో బలవంతంగా లోబరుకునేందుకు ప్రయత్నించాడు.అదే సమయానికి ఆ బాలిక యువతి రావడంతో అసలు గుట్టు రట్టయింది.
ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.హైదరాబాద్ కు చెందిన షపీయుల్లా అనే వ్యక్తి మంత్రగాడిగా పేరుగాంచాడు.తన దగ్గరకు వచ్చే ప్రజలకు తాయత్తులు కడుతూ, మంత్రాలతో వ్యాధులను నయం చేస్తానని నమ్మించేవాడు.ఇలాగే తన దగ్గరకు వచ్చిన ఐదుగురు మహిళలకు మాయమాటలు చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు.
ఒక మహిళ భర్త చనిపోయి తన కూతురుతో ఒంటరిగా ఉంటుంది.తనకు పెళ్లి కాలేదంటూ ఆ మహిళను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తన కూతురుతో కలిసి షపీయుల్లాతో ఉంటోంది.ఈ క్రమంలో షపీయుల్లా కన్ను సవతి కూతురుపై పడింది.
భార్య లేని సమయంలో ఆ బాలికను వేధించడం మొదలుపెట్టాడు.
షపీయుల్లా ఒకరోజు తన భార్య లేని సమయంలో ఆ బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.
సరిగ్గా అదే సమయంలో తల్లి రావడంతో ఆ బాలిక జరిగిన విషయాన్నీ తల్లికి చెప్పడంతో అసలు విషయం బయటపడింది.అయితే ఈ విషయం బయట చెబితే తల్లీకూతుళ్లను చంపేస్తానని షపీయుల్లా బెదిరించాడు.
ఇదంతా విన్న బాలిక తల్లి షపీయుల్లాతో తమకు ఎప్పటికైనా ముప్పేనని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.