లోకల్ ట్రెయిన్ ఫుట్ బోర్డ్ పై స్టంట్ చేయబోయి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంది ఓ యువతి.ఓ క్షణం ఆలస్యమైనా యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే.
ఈ ఘటన సోమవారం(అక్టోబర్-1) నాడు ముంబైలోని ఘాట్కోపర్, విక్రోలీ స్టేషన్ల మధ్య జరిగింది.థానె జిల్లా దివాకు చెందిన ఆ యువతి సీఎస్టీలో కల్యాణ్ వెళ్లే ట్రెయిన్ ఎక్కింది.
ట్రెయిన్లో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ.ఫుట్బోర్డు వద్ద నిలుచుంది.
చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతోంది.ఫుట్బోర్డు మధ్యలో ఉన్న పోల్ను పట్టుకొని ఇక విన్యాసాలు చేయడం ప్రారంభించింది.
తలో పట్టు తప్పి లోకల్ ట్రెయిన్ కిందికి జారింది.అప్పుడో వేరే లైన్ నుంచి మరో లోకల్ ట్రెయిన్ వెళ్తోంది.వెంటనే స్పందించిన తోటి ప్రయాణికులు ఆ యువతిని పైకి లాగారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వాళ్లు ఏమాత్రం లేట్ చేసినా తన స్టంట్ కాస్త బెడిసికొట్టేది.వెంటనే స్పందించిన ఇతర ప్రయాణికులు ఆ యువతిని వెంటనే పైకి లాగారు.
లేకపోతే తన ప్రాణాలు పోయేవే.తను కింద పడగానే ప్రయాణికులు ఆన్దిస్పాట్ తనను పైకి లాగారు.
ఆ వీడియో మీరే చూడండి.