అవునండి.ఓ వ్యక్తి ఓకే నెలలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.షాకింగ్ గా ఉంది.కానీ ఈ ఘటన నిజంగానే జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.నిజామాబాద్ జిల్లాలో బోధన్కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఈ ఏడాది ఫిబ్రవరి 26న అందాపూర్కు చెందిన మనీషా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.
అయితే నెల రోజులు కూడా పూర్తి అవ్వకముందే మంచిర్యాలకు చెందిన వనజ అనే యువతిని మార్చి 20న యాదగిరిగుట్టలో రెండో పెళ్లి చేసుకున్నాడు.ఇది తెలియక ఇద్దరి భార్యలతో కొద్దిరోజులు బాగానే గడిచింది.
కానీ మొదటి భార్య మనీషాకు భర్త శ్రీకాంత్ పై అనుమానం రావడంతో రెండో పెళ్లి విషయం బయటపడింది.
అయితే భర్త శ్రీకాంత్ చేసిన మోసాన్ని భరించలేక మనీషా తనకు న్యాయం చేయాలంటూ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టింది.
పెళ్లి పేరిట శ్రీకాంత్ మహిళలను మోసం చేస్తున్నాడు అని.అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ పోలీసుల ముందు డిమాండ్ చేసింది.ఇంకా ఆమెకు మద్దతుగా మహిళా సంఘాలు కూడా ఆందోళనకు దిగాయి.కాగా శ్రీకాంత్పై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి.కాగా నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.