ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క పెళ్లితోనే.జీవితంలో ఎన్నో ఎబ్బందులు పడుతూ.
నెత్టుకొస్తున్న జీవితాలను చూసి కూడా.ఈ మనిషి కళ్ళు తెరవలేదు.
అసలు విషయం ఏమిటంటే…ఇది ఒక నియా పెళ్లి కొడుకు కధ…మాయ మాటలు చెప్పి ముగ్గురిని పెళ్లాడిన ఓ వ్యక్తిని సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు పట్టుకున్న కధ.పోలీసుల కధనం ప్రకారం…విశాఖపట్నంకు చెందిన గాజువాక వాసి అవినాష్ సికింద్రాబాద్ మెట్టుగూడలో రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న తన తల్లి క్వార్టర్స్లో ఉండేవాడు.2009లో అతనికి వివాహం జరిగింది.ముగ్గురు సంతానం…వృత్తిరీత్యా అమీర్పేటలోని ఓ బట్టలదుకాణంలో పనిచేస్తుండే వాడు.
ప్రతాప్నగర్లోని మరో యువతికి మాయ మాటలు చెప్ప సికింద్రాబాద్ లోని ఉప్పుగూడలో రెండో కాపురం పెట్టాడు.స్వగ్రామం గాజువాకలో మరో యువతిని నమ్మించ ఆమెను సైతం ఉప్పుగూడలో మరో ప్రాంతంలో ఉంచాడు.
కొన్ని రోజుల క్రితం పోలీసుస్టేషన్లో ప్రతాప్నగర్కు చెందిన యువతి అన్నయ్య తన చెల్లెలు కన్పించడం లేదని ఫిర్యాదు చేశాడు.దీంతో పోలీసులు ఆ యువతికి చెందిన సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా ఉప్పుగూడలో ఆమెతో పాటు అవినాష్ను ఉన్నట్లు తెలుసుకున్నారు.
కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.