మత్తుకు అలవాటు అయిన వారు ఎంతటి దారుణంకు అయినా ఒడిగడతారు అనే విషయం మరోసారి వెళ్లడయ్యింది.ప్రపంచంలో జరిగే నేరాల్లో సగానికి పైగా నేరాలు తాగిన మత్తులో చేసిన తప్పులే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కొందరు తాగితే భార్యలను కొడతారు, మరి కొందరు హింసిస్తారు.కాని ఒక భర్త మాత్రం తన భార్యనే అమ్మేశాడు.
అది కూడా మద్యంకు డబ్బులు లేని కారణంగా బార్యను అమ్మేశాడు.ఇది అత్యంత దారుణం.
కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశం అయ్యింది.ఇలాంటి భర్తలను వెంటనే ఉరి తీయాలి అంటూ మహిళ సంఘాల వారు డిమాండ్ చేస్తారు.
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ ప్రాంతంకు చెందిన ఒక తాగుబోతు భర్త తాగేందుకు డబ్బులు లేక పోవడంతో తన భార్యను గదిలో బంధించి పక్కింటికి చెందిన వ్యక్తిని తీసుకుని వచ్చాడు.పక్కింటి వ్యక్తి మరో వ్యక్తితో కలిసి గదిలోకి వెళ్లి ఆమెపై అఘాయిత్యం చేశారు.
దాదాపు గంట పాటు ఇద్దరు కూడా ఆమెను చిత్ర వదకు గురి చేసి అఘాయిత్యంకు పాల్పడ్డారు.వారిద్దరు ఆమెతో కోరిక తీర్చుకున్నందుకు గాను తాగు బోతు భర్తకు డబ్బులు చేతిలో పెట్టారు.
ఆ సమయంలో ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది.భర్తను ఇలా చేయవద్దని వేడుకుంది.
కాని అతడి మనసు మాత్రం కరగలేదు.
తర్వాత రోజు కూడా పక్కింటి వ్యక్తి వచ్చి డబ్బులు ఇస్తాను అంటూ మరోసారి నీ భార్యతో సుఖం కావాలన్నాడు.ఆ సమయంలో భార్య తీవ్రంగా ప్రతిఘటించింది.భర్తతో గొడవకు దిగింది.
ఇంట్లోంచి బయటకు పారిపోయి వచ్చింది.అదే సమయంలో పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది.
పుట్టింటికి వెళ్లిన ఆమె తల్లికి ఈ విషయాన్ని చెప్పలేదు.అయితే కొన్ని రోజుల తర్వాత తల్లికి తెలియడంతో తన కూతురుకు జరిగిన అన్యాయంపై పోలీసు ఫిర్యాదు చేసింది.
దాంతో పోలీసులు భర్తతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని ఎంక్వౌరీ చేస్తున్నారు.
ఇలాంటి నీచుడిని కఠినంగా శిక్షించాలంటూ మహిళ సంఘాల వారు అంటున్నారు.తాగుడు కోసం భార్యను పక్కింటి వారి వద్ద పండబెట్టిన ఈ నీచుడు అసలు భూమిమీద బతికేందుకే అనర్హుడు అంటూ చాలా మంది ఆందోళనలు చేస్తున్నారు.