ప్రపంచ వ్యాప్తంగా యువతను ఊపేస్తున్న మొబైల్ గేమ్ పబ్జి.ఈ గేమ్ ఎన్నో హత్యలకు ఆత్మహత్యలకు కారణం అవుతుందనే ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నానే ఉన్నాయి.
గత రెండు మూడు నెలలుగా పబ్ జి గేమ్ గురించిన బాధకర విషయాలు, అవాక్కయ్యే విషయాలు మనం ఎన్నో వింటూ వస్తున్నాం.తాజాగా ఒక మలేషియన్ చేసిన పని అందరు అవాక్కయ్యేలా చేస్తుంది.32 ఏళ్ల ఆ మలేషియన్ కొన్ని వారాల క్రితం పబ్ జి గేమ్ ను ఆడటం మొదలు పెట్టాడు.అతడు పబ్ జి గేమ్ ఆడుతున్న సమయంలో ఎవరైనా అడ్డు వస్తే తీవ్ర కోపోద్రిక్తుడు అయ్యేవాడు.
తాజాగా ఇంటి నుండి వెళ్లి పోయి భార్యకు శోఖం మిగిల్చాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…
జాకోస్ అనే వ్యక్తి మలేషియాలో ఒక ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు.
భార్య, కుటుంబం అంతా సాఫీగా అతడి జీవితం సాగుతుంది.అలాంటి సమయంలో తమ్ముడు పబ్ జి గేమ్ను అలవాటు చేశాడు.
దాంతో ఆన్ లైన్ లో స్నేహితులతో కలిసి పబ్జి గేమ్ ఆడుతూ ఉండేవాడు, రాత్రి అంతా కూడా స్నేహితులతో పబ్ జి గేమ్ ఆడుతూ పగలంతా పడుకునే వాడు.కొన్ని రోజులకు ఉద్యోగం మానేశాడు.
ఉద్యోగం మానేస్తే ఆర్థిక పరిస్థితి ఏంటీ అంటూ భార్య అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించేది.ఒకానొక సమయంలో ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
నాలుగు నెలల గర్బంతో ఉన్న ఆమె పదే పదే భర్తను పబ్ జి నుండి దూరం చేసేందుకు అతడిపై అరిచేది.
భార్య తనను పబ్జి ఆడుకోనివ్వడం లేదని భావించిన అతడు ఇంటి నుండి పారిపోయాడు.బందాలు, బంధుత్వాలు, బాధ్యతలు ఇలా ఏవీ తనకు వద్దని, కేవలం తనకు పబ్ జి గేమ్ ఒక్కటి చాలు అంటూ అతడు ఇంట్లోంచి వెళ్లి పోయాడు.వెళ్లి పోయి నెల రోజులు అవుతుంది.
దాంతో తన భర్త తిరిగి రావాలని అంతా కోరుకోండి, ఆయన కోసం నేను నా కడుపులో ఉన్న పాపాయి ఎదురు చూస్తున్నాం అంటూ ఫేస్ బుక్ ద్వారా విజ్ఞప్తి చేసింది.పబ్ జి మోజులో పడి అతడు తిన్నాడో లేదో, అసలు ఉన్నాడో లేదో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
కేవలం ఈ ఒక్క వ్యక్తి మాత్రమే కాకుండా ఎంతో మంది పబ్ జి వల్ల తమను తాము నాశనం చేసుకుంటున్నారు.ఇండియాలో కొన్ని రాష్ట్రల్లో పబ్ జిని బ్యాన్ చేశారు.
ఇండియాలో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి.మరిన్ని దారుణాలు జరుగక ముందే పబ్ జిని బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.