తన భార్యతో గొడవ పడిందనే నెపంతో ఓ ప్రబుద్ధుడు చేసిన ఘనకార్యంతో ఆ వార్త బెంగుళూరులో హాట్ టాపిక్గా మారింది.కంప్లి పరిధిలోని సణ్ణాపురం గ్రామ పంచాయతీలోని ఇటిగి గ్రామంలో దళిత మురారమ్మ(45) తన అన్న ముకుందప్ప ఇంటికి వచ్చింది.
ఈ క్రమంలో తన అన్న భార్యతో మురారమ్మ గొడవ పడింది.
ఈ విషయం తెలుకున్న ముకుందప్ప తన భార్యతో గొడవ పడతావా అంటూ తన చెల్లెలిపై కోపంతో ఊగిపోయాడు.
అదే ఆవేశంలో ముకుందప్ప ఓ కర్ర తీసుకుని తన చెల్లెలిపై దాడి చేశాడు.దీంతో తీవ్ర గాయాలపాలైన మురారమ్మను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కాగా కేసు నమోదు చేసిన పోలీసులు, మురారమ్మ తన అన్న భార్యతో ఏ విషయంలో గొడవ పడిందని, అది హత్యకు ఎందుకు దారి తీసిందనే అంశాలపై విచారణ చేపట్టారు.
ఏదేమైనా కోపంతో తన చెల్లిని చంపుకున్న ముకుందప్పపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.