ప్రస్తుత కాలంలో కొందరు ప్రతీ చిన్న విషయానికి ఆవేశానికి లోనవుతూ హత్యలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి టీ లోకి పంచదార తక్కువ వేసి ఇచ్చిందని తన ఏకంగా కట్టుకున్న భార్యని దారుణంగా గొంతు కోసి చంపిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ పరిసర ప్రాంతంలో నివాసముంటున్నాడు.అయితే ఈ వ్యక్తి భార్య గర్భంతో ఉంది.కాగా ఎప్పటిలాగే వివాహిత తన భర్తకు ఉదయం లేచిన సమయంలో తేనీటి పానీయాన్ని అందించింది.అయితే టీ లో చక్కెర తక్కువయిందని ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఈ గొడవలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో క్షణికావేశానికి లోనైన వ్యక్తి తన భార్యపై కత్తితో దారుణంగా దాడి చేశాడు.దీంతో తీవ్ర రక్తస్రావానికి గురయినటువంటి వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది.
దీంతో భయపడిన మృతురాలి భర్త వెంటనే అక్కడి నుంచి చెప్పాపెట్టకుండా పరారయ్యాడు.
కాగా స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.
అలాగే స్థానికులు మరియు మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇందులో భాగంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.మరి కొందరు నెటిజన్లు ఈ విషయం గురించి స్పందిస్తూ ప్రస్తుత జనరేషన్ లో కొందరు ప్రతి చిన్న విషయానికి హత్యలు చేస్తున్నారని కాబట్టి నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.