కాలం మారుతోంది.టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.
కానీ నేటికీ కొందరు మూఢ నమ్మకాలపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.కొన్ని సందర్భాల్లో ఆ మూఢ నమ్మకాలే ప్రాణాలు తీస్తున్నాయి.
తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న ఒక ఘటనలో భూత వైద్యం వల్ల మహిళ ప్రాణం పోయింది.దెయ్యం పట్టిందనే సాకు చూపి భూత వైద్యుడు మహిళను చిత్రహింసలకు గురి చేసి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు.
మంచిర్యాల జిల్లా కుందారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కరీంనగర్ జిల్లా గద్దపాకకు చెందిన ప్రతిమ అనే యువతి మంచిర్యాల జిల్లాకు చెందిన మల్లేష్ అనే యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది.
పెళ్లైన కొన్ని రోజుల తర్వాత ఆమె అనారోగ్యంపాలైంది.ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో వారం రోజుల క్రితం రజిత కుటుంబ సభ్యులు ఆమెను పుట్టింటికి తీసుకువచ్చారు.తర్వాత వాళ్లు ఆమెకు దెయ్యం పట్టిందని భావించారు.
ఆమెను కుటుంబ సభ్యులు భూత వైద్యుడికి చూపించగా శ్యామ్ అనే భూత వైద్యుడు ఆమెను విచక్షణారహితంగా కొట్టి, తల వెంట్రుకలు లాగుతూ మంచంపై పడేశాడు.
అనంతరం రజిత స్పృహ తప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.రెండు నెలల క్రితం రజిత ఒక పాపకు జన్మనిచ్చింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.