కొందరు అంతే.ఉన్నట్టుండి అదృష్టవంతులైపోతారు.
రోజు చేసే పని చేసిన సరే వారు ఉన్నట్టుండి అదృష్టవంతులు అవుతారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి ఉన్నట్టుండి అదృష్టవంతుడయ్యాడు.
ఎవరు అనుకుంటున్నారా? దినసరి కూలీగా.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
కర్నూలు జిల్లా లోని తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఓ దినసరి కూలీకి వజ్రం దొరికింది.
ఇంకా ఆ వజ్రం విలువ ఏకంగా 9 లక్షల రూపాయిలు.
అయితే అందరిలా అతను వజ్రాల వేటకు వెళ్ళలేదు.రోజులనే పని చేసేందుకు వెళ్ళాడు ఏకంగా అతనికి వజ్రం దొరికింది.
దీంతో నిన్నటి వరకు దినసరి కూలీగా ఉన్న అతను ఈరోజు ఒక్కసారిగా లక్షాధికారి అయిపోయాడు.దీంతో ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వ్యవసాయ కూలికి దొరికిన వజ్రం గురించి పక్కన పెడితే ఆ ఊరిలో బాగా వర్షాలు పడితే భూముల్లో ఉండే వజ్రాలు, బంగారు నిక్షేపాలు బయటపడుతుంటాయి.ఇంకా ఈ విషయాన్నీ భూగర్భ పరిశోధన సంస్థనే నిర్దారించిందట.
తొలకరి వర్షం పడగానే కర్నూల్ కు చుట్టుపక్కల ప్రాంతాలైన జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి, తుగ్గలి ప్రాంత పొలాలకు వజ్రాల కోసం ఎంతమంది వస్తుంటారు.ఆ ప్రాంతంలో దొరికిన వజ్రాలను బహిరంగంగా వేలంలోకు వేస్తారు.