ఒక బైక్ మీద మహా అంటే ఎంత మంది ఎక్కగలరు.ఫ్రీగా ఉండాలి అంటే ఇద్దరు.
లేదంటే ముగ్గురు అయినా ఎక్కడానికి అవకాశం ఉంటుంది.అయితే ఒకే బండి మీద ఒక డజను మంది ఎక్కడం ఎప్పుడైనా మీరు చూసారా.
అంత ఎందుకు నలుగురు ఎక్కడం కూడా చూసి ఉండరు.కానీ ఇప్పుడు మనం చుస్తున్న ఫొటోలో ఒక బండి మీద ఏకంగా డజను మంది ఎక్కారు.
అంతమంది ఎలా ఎక్కుతారు అది ఎమన్నా ఆటోనా లేదంటే బస్సునా అంతమంది ఎక్కడానికి అని అనుకుంటున్నారా.నిజమండి బాబు ఒకే బైక్ మీద అంత మంది ఎక్కి రోడ్డు మీద స్పీడ్ గా వెళ్తున్న వారిని పక్కన ఉన్న వారు చూసి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఫోటో బయటకు వచ్చింది.
అది పోలీసుల వరకు కూడా వెళ్లడంతో ఆ బైక్ నడిపిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకున్నారు.
అసలు బైక్ మీద ముగ్గురు వెళ్తేనే ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తున్నారని ఫైన్ వేస్తారు.అలాంటిది ఇతడు ఏకంగా చిన్న పిల్లలను అంత మందిని ఎక్కించుకుని వాళ్ళను ప్రమాదంలో పడేస్తూ రోడ్డు మీద స్పీడ్ గా దూసుకు పోతున్నాడు.ఇదంతా కూడా పక్కనే ఉన్న వ్యక్తి వీడియో తీయడంతో ఇది బయట పడింది.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పిల్లలను అంత ప్రమాదంలో పడేస్తూ ఎంత సహసం చేయడం అవసరమా అంటూ అతడిపై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు పిల్లలు అంత మందిని ఎక్కిచుకోవడమే కాకుండా మళ్ళీ అంత స్పీడ్ గా వెళ్లడం చూసి అతడు మనిషేనా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అతడు ఇదంతా ఎందుకు చేసాడో తెలియదు కానీ పోలీసులు కూడా అతడి కోసం గాలిస్తున్నారు.
దొరికిన వెంటనే అరెస్ట్ చేసి బుడ్డి చెప్పాలని నెటిజెన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు.