ప్రమాదం అంటేనే చెప్పి రాదు అని అంటారు.ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరూ ఊహించలేరు కూడా.
గతంలో జంతువుల ఛానల్ లో జంతువుల గురించి విశ్లేషించే ఒక వ్యక్తి ఒక చేప కారణంగా మృతి చెందిన ఘటన గుర్తు ఉండే ఉంటుంది.ఆయన ఆ ఛానల్ లో భాగముగా పాములతోనే మెలిగేవ్యక్తి ఒక చేప కారణంగా మృతి చెందాడు.అయితే ఇప్పుడు ఫిలిప్పీన్స్ నదిలో చేపలు పడుతూ ఒక వ్యక్తి అనుకోని ప్రమాదం లో మరణించాడు.50 సంవత్సరాల ఆ వ్యక్తికి చేపలు పట్టడమే జీవనాధారం, అందుకే ఆ చేపల వేటలో కూడా అతడు ఎప్పుడూ పాల్గొంటూ ఉంటాడు.అయితే వేటలో భాగంగా చేపను పట్టిన వెంటనే తన దంతాలతో నొక్కి పట్టుకోవడం అలవాటు.అయితే అతనికి ఉన్న ఆ అలవాటే చివరికి అతడి ప్రాణాన్ని తీసింది.
దంతాల మధ్య ఉంచుకున్న టిలాపియా రకం చేపను ప్రమాదవశాత్తు మింగడంతో శ్వాసరంధ్రాలు మూసుకుపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.అయితే వెంటనే అతడిని స్థానికులు గుర్తించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.కేవలం అతడికి ఉన్న అలవాటు లో పొరపాటు చోటుచేసుకోవడం తో అతడు తన ప్రాణాలను కూడా పోగొట్టుకోవలసి వచ్చింది.