వైద్యులు ఎంత దారుణంగా ఉన్నారు అనేదానికి ఈ ఘటనే నిదర్శనం.బ్రతికున్న వ్యక్తిని చచ్చిపోయాడు అంటూ ఆస్పత్రి సిబ్బంది మార్చురీ గదిలోకి తరలించింది.
కొలంబియాలోని సిన్స్లేజోలో జువాన్ జోస్ అనే 67 ఏళ్ల వ్యక్తి హై బ్లడ్ ప్రెజర్తో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు.అయితే రెండు గంటల తర్వాత వైద్యులు వచ్చి చనిపోయాడని మార్చురీకి తరలించారు.
తన తండ్రి బతికే ఉన్నాడని చెప్పినా వైద్యులు మాటా వినలేదు.అతడు చనిపోయాడు అని బలవంతంగా హాస్పిటల్ మార్చురీలోకి తీసుకెళ్లారు.కరోనా కారణంగా ఆ యువతిని మార్చురీలోకి అనుమతించమని ఆ హాస్పిటల్ యాజమాన్యం చెప్పేశారు.అయినా సరే ఆ కూతురికి ఏదో అనుమానం వెంటాడుతుంది.
తండ్రితో కదలికలు చూసినట్టు సందేహం వచ్చింది.దీంతో వెనకడుగు వేస్తే ఉన్న ప్రాణం పోతుందని అనుకోని హాస్పిటల్ సిబ్బందిని ఎదురించి మార్చురీలోకి పరిగెత్తిపోయింది.మార్చురీ గదిలో శవంలా పడి ఉన్న తండ్రిని గట్టిగ కదిపింది.అంతే అతడు ఒక్కసారి కళ్లు తెరిచి లేచి కూర్చున్నాడు.
దీంతో అతన్ని వెంటనే మరో హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జోస్ కుటుంబం ఆ హాస్పిటల్పై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.