సాధారణంగా నేరం చేసిన వాళ్ళను వారి నేరాన్ని బట్టి వారికి శిక్ష విధిస్తుంటారు.ఈ తరుణంలోనే నేరం చేసిన వ్యక్తిని రిమాండ్ కు తరలించి జైలులో బంధించారు.
జైలులో ఉన్న వ్యక్తికి తన బంధువులను కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంటారన్న విషయం మనకు తెలిసిందే.ఈ తరుణంలోనే ఆ వ్యక్తి తన భార్యను కలవాలని సదరు జైలు అధికారులకు విన్నవించుకున్నాడు.
ఆ విషయాన్ని తన భార్యకు తెలుపగా అందుకు ఆమె నిరాకరించింది.ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి ఏం చేసాడో తెలుసా? ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తన మర్మాంగాలను కోసుకున్న ఘటన ఆ జైలులో చోటు చేసుకుంది.
ఎంతో మంది క్షణికావేశంలో ఎన్నో నేరాలను చేసి జైలు పాలవడం మనం చూస్తూనే ఉంటాం.అయితే వారికి కొన్ని నెలలు పాటు కోర్టు శిక్ష విధిస్తూ ఉంటుంది.
ఈ తరుణంలోనే ఓ వ్యక్తికి నేరం చేసినందుకుగాను అతనిని జైలులో ఉంచారు.జైలులో ఉంచిన ఆ వ్యక్తికి చట్టప్రకారం తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అనుమతి ఉంటుందని తెలుసుకున్న ఆ వ్యక్తి తన భార్యను చూడాలని ఉందంటూ జైలు అధికారి తెలిపాడు.
ఈ విషయం తెలుసుకున్న ఆ నేరస్తుడి భార్య అతన్ని కలవడానికి నిరాకరించింది.
తన భర్తను చూడడానికి నేను రాను అని చెప్పడంతో పాటు, ఎప్పటికీ తన మొహం కూడా చూడాలనుకోవడం లేదంటూ తేల్చి చెప్పింది.తన భార్య అలా నిరాకరించడంతో ఎంతో కోపోద్రిక్తుడై ఆ నేరస్తుడు జైలులో ఉన్న ఓ పదునైన కత్తిని తీసుకుని ఏకంగా తన మర్మాంగాలను కోసుకున్నాడు.తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ కిందపడిపోయి ఉన్న ఆ నేరస్తుడిని ఇతర ఖైదీలు చూసి జైలు అధికారులకు తెలిపారు.
దీంతో హుటాహుటిన చికిత్సకోసం జైలు అధికారులు ఆ వ్యక్తిని జైలులోనే ఉన్న హెల్త్ సెంటర్ కు తరలించారు.ఆ వ్యక్తి చేసిన వింత పని పై పోలీసులు ఆరా తీయగా అతనికి సైకియాట్రిక్ సమస్యలు ఉన్నాయని తన ఇంటి చుట్టుపక్కల వారు చెప్పడంతో, ప్రస్తుతం ఆ వ్యక్తి చేసిన పని చూస్తే నిజమేనని పోలీసులు కూడా భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.