సాధారణంగా మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడా అయినా నిలబడినప్పుడు కానీ పాము అనగానే భయపడి పారిపోతారు కొంతమంది కర్రలు తీసుకొని చంపడానికి చూస్తారు.మరి కొందరు వద్దు పాపం అని చెప్తారు.
అదే మనం ఉన్నా రూమ్లో అందులో ఒక పామును విడిచి పెడితే ఇక వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉంటారు.ఆ పాము తనని ఎక్కడ ఏం చేస్తుందో కాటు వేస్తుంది ఏమో అని భయం తో ఉంటారు.
సహజంగా పాములు మనుషులను చూడంగానే చంపేస్తారు అన్న భయంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది.ఆ పాముని చూసిన మనము మనకు ఏమి హాని తల పెడుతుంది అన్న భయంతో దానిని చంపడానికి చూస్తాం.
కానీ పాములు మనుషులను ఏమి చేయవని వాటికి హాని కలగకుండా ఉంటే అవి వచ్చిన దారినే వెళ్లిపోతాయి అంటున్నాడు నీలం కుమార్ ఖైరి.
ఇక విషయంలోకి వెళితే అతని పేరు నీలం కుమార్ ఖైరి .అతను పాములు నుండి మనుషులకు ఎటువంటి హాని ఉండదు అని తెలుపడానికి ఒక గ్లాస్ రూమ్ లో 72 గంటల పాటు పాములతో గడిపాడు.నీలం కుమార్ కి పాములు అంటే ఎంతో ఇష్టం.
ఎవరైనా అతడి ముందు పాము చంపడానికి చూస్తే వాటిని తీసుకొని వెళ్ళిదూరంగా వదిలేసి వచ్చేవాడు.అయితే పాములు ఏమి చేయమని వాటిని రెచ్చగొడితే తప్ప అది కాటు వేయదని అందరికీ తెలియ చేయాలనుకున్నాడు.అందుకోసం తాను పాములతో గడిపి చూపించారు.
72 గంటల పాటు పాములతో కలిసి ఉన్న చిన్న గీత కూడా లేకుండా సురక్షితంగా బయటకు వచ్చాడు.1980లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది.అప్పట్లో ఒక వ్యక్తి పాములతో 50 గంటల పాటు ఉన్నాడని తెలుసుకొని తను 72 గంటల పాటు పాములతో గడిపి రికార్డును సృష్టించాడు.తాను అనుకున్నట్లే చేసి చూపించాడు.28 ఏళ్ల వయసులో ఈ ఘనతను సాధించాడు నీలం కుమార్.ఈ రికార్డును సొంతం చేసుకున్న తర్వాత పాముల పార్కు పెట్టాలని ఆలోచించి కలలు కని దానిని కూడా సాధించాడు.ఆ పార్కు ప్రస్తుతం రాజీవ్ గాంధీ జువాలజికల్ పార్క్ గా పిలవబడుతోంది.
అప్పటినుండి ఇప్పటివరకు పాముల మీద అధ్యయనం చేస్తూ ఉన్నాడు నీలం కుమార్ ఖైరి.