హైదరాబాద్ ప్రగతిభవన్ ఎదుట కుటుంబంతో సహా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.ఇబ్రహీంపట్నంకు చెందిన ఐలేశ్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు బలవన్మరణానికి పాల్పడుతున్న వ్యక్తిని అడ్డుకున్నారు.అయితే ప్రభుత్వం తమ భూమిని తీసుకుని పరిహారం చెల్లించడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
గత్యంతరం లేక ఆత్మహత్యకు ప్రయత్నించానని వాపోయాడు.ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరాడు.