ఎంత ప‌ని చేశాడు.. రూ. 40 వేలు కరెంట్ బిల్లు వ‌చ్చింద‌ని కిరోసిన్ పోసుకుని..

కరోనా వైరస్.చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

 A Man Commits Suicide Due To Electricity Bill!!  Suicide, Electricity Bill, Late-TeluguStop.com

అయితే మ‌రోవైపు క‌రోనా‌ కంటే కరెంట్ బిల్లులు ప్ర‌జ‌ల‌కు షాక్ ఇస్తున్నాయి.పూరి గుడిసెల‌కు, చిన్న చిన్న‌ షాపులకు సైతం రూ.లక్షల్లో బిల్లు వస్తోంది.బిల్లు చూసి.

సదరు వినియోగదారులు ల‌బోదిబోమంటున్నారు.

వాస్త‌వానికి క‌రెంట్‌ ముట్టుకుంటే షాక్ కొట్టేది.

కానీ, ఈ మ‌ధ్య కాలంలో కరెంట్ బిల్లు చూస్తేనే షాక్ కొడ్తోంది.ఇక తాజాగా ఓ క‌రెంట్ బిల్లు నిండు ప్రాణాన్ని బ‌లితీసుకుంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నగరంలో లీలాధర్ లక్ష్మణ్(57) అనే సామాన్య వ్యక్తి భార్యా, పిల్ల‌ల‌తో నివాసం ఉంటున్నాడు.

అయితే ఇంటికి గత వారం కరెంట్ బిల్లు ఏకంగా రూ.40,000 వచ్చింది.అది చూసిన లీలాధర్ లక్ష్మణ్ బెంబేలెత్తిపోయాడు.లక్ష్మణ్ ఏం చేయాలో అర్థం కాలేదు.

ఇంత డ‌బ్బు ఎక్క‌డ నుంచి తెచ్చి క‌ట్టాలో తెలియ‌క తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం తన ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విష‌యం తెలుసుకుని పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని విచార‌ణ చేప‌ట్ట‌గా.కరెంట్ బిల్లు టెన్షన్ కారణంగా అతిగా మద్యం సేవించిన లక్ష్మణ్.ఆ మత్తులోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుసుకున్నారు.కుటుంబ‌స‌భ్యులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని ఎంత చెప్పినా.

లక్ష్మణ్ విన‌కుండా ఆత్మహత్యకు పాల్పడిన‌ట్టు తేలింది.ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube