ఈ మధ్యకాలంలో క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఏకంగా మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి.తాజాగా ఇక్కడ ఒక వ్యక్తి తన భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది చూసిన అతని తమ్ముడు కూడా మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
అయితే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో స్థానికంగా కలకలం రేపింది ఈ ఘటన.
ఉత్తర ప్రదేశ్ నివాసముండే శైలేంద్ర వర్మ అనే వ్యక్తికి పది నెలల కిందట పింకీ అనే యువతితో వివాహమైంది.వీరి దాంపత్య జీవితం అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని ఘటన వారి జీవితంలోకి ఎదురైంది.భర్త ఫేస్బుక్ లైవ్ పెట్టి భార్యను అతి దారుణంగా కాల్చి చంపాడు.
అనంతరం తాను కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే ఈ ఘటన చూసిన శైలేంద్ర తమ్ముడు విశాల్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
దీంతో ఇంట్లో రక్తపు మడుగులో ఉన్న ఇద్దరు కుమారులు కోడలు మృతదేహాలను చూసి తల్లిదండ్రులు అవాక్కయ్యారు.అయితే శైలేంద్ర భార్యను చంపడానికి గల కారణం ఏమిటి అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారిపోయింది.