దారుణం భార్యను చంపిన భర్త... తర్వాత భర్త, మరిది కూడా..?

ఈ మధ్యకాలంలో క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఏకంగా మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి.తాజాగా ఇక్కడ ఒక వ్యక్తి తన భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

 Man Commits Suicide After Killing His Wife, Uttar Pradesh, Shailendra Varma, Vis-TeluguStop.com

ఇది చూసిన అతని తమ్ముడు కూడా మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

అయితే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో స్థానికంగా కలకలం రేపింది ఈ ఘటన.

ఉత్తర ప్రదేశ్ నివాసముండే శైలేంద్ర వర్మ అనే వ్యక్తికి పది నెలల కిందట పింకీ అనే యువతితో వివాహమైంది.వీరి దాంపత్య జీవితం అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని ఘటన వారి జీవితంలోకి ఎదురైంది.భర్త ఫేస్బుక్ లైవ్ పెట్టి భార్యను అతి దారుణంగా కాల్చి చంపాడు.

అనంతరం తాను కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే ఈ ఘటన చూసిన శైలేంద్ర తమ్ముడు విశాల్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

దీంతో ఇంట్లో రక్తపు మడుగులో ఉన్న ఇద్దరు కుమారులు కోడలు మృతదేహాలను చూసి తల్లిదండ్రులు అవాక్కయ్యారు.అయితే శైలేంద్ర భార్యను చంపడానికి గల కారణం ఏమిటి అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube