ఎవరికైనా పిల్లలు పుడితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతారు.ఎప్పుడెప్పుడు తమ పిల్లలను చూడాలని వెయ్యి కళ్ళ తో ఎదురుచూస్తూ ఉంటారు.
ఆ ఆనంద క్షణాల కోసం తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తూ ఉంటారు.అంత సంతోషకరమైన వార్త తమ బంధువుల అందరితో పంచుకుంటారు.
కానీ కర్నూలు జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా ఎంతో విషాద ఘటన చోటు చేసుకుంది.
తనకు కొడుకు పుట్టిన గంటకే ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
వారికి కొడుకు పుట్టాడన్న ఆనందం కన్నా తన భర్త మరణ వార్తను విని తట్టుకోలేక పోయింది భార్య.అసలు అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం తెలిస్తే ఎవరికైన సరే కన్నీళ్లు ఆగవు… అంతలా ఆ ఘటన ఏం జరిగిందంటే?కర్నూలు జిల్లా సి.బెళగల్కు చెందిన రాముడు, సత్యవతి దంపతుల కుమారుడు వినోద్ అనే వ్యక్తికి దేవనకొండలోని నెల్లుబండకు చెందిన ప్రశాంతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.వీరిద్దరికీ ఇదివరకే ఒక కుమారుడు ఉన్నాడు.
వినోద్ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు.అయితే తన భార్య రెండో సారి గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్ళింది.
మంగళవారం రాత్రి తన భార్యకు పురిటి నొప్పులు రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లారు.తనతో పాటు వినోద్ నీ ఆసుపత్రికి రమ్మని పిలువగా తర్వాత వస్తానని వారితో చెప్పి పంపించాడు.
మంగళవారం సాయంత్రం వినోద్ భార్య మగబిడ్డ కు జన్మనిచ్చింది.
తన బిడ్డను చూడడానికి వెళ్లాలనుకున్నా, తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే పోలీసులకు ఫిర్యాదు అందడంతో డబ్బులు లేవన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.