దేవుడిపై భక్తి ఉండడం సర్వసాధారణమే.కాని ఆ భక్తిని పూజలు చేయడం ద్వారా, నోములు, వ్రతాలు చేయడం, కోరిన కోరికలు నెరవేరితే ఘనంగా ఉత్సవాలు చేయడం వంటివి మనం చూస్తూ ఉంటాం.
కానీ ఓ భక్తుడు తన కోరిక నెరవేరిందని దేవుడికి ఏకంగా తన నాలుకను కత్తిరించి నైవేద్యంగా సమర్పించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు… ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, బాబేరు ప్రాంతంలోనీ భాటి అనే గ్రామానికి చెందిన యువకుడు ఏకంగా తన నాలుకను కత్తిరించి దేవుడికి నైవేద్యం సమర్పించాడు.
ఆదివారం ఆత్మారాం(22) అనే యువకుడు దేవుడికి మొక్కుబడిగా ఉన్నందున ఏకంగా తన నాలుకను కోసుకొని దేవుడికి నైవేద్యం సమర్పించాడు.అయితే అధిక రక్తస్రావం గా ఉండడంతో అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లి సరైన చికిత్సను అందించారు.
ప్రస్తుతం ఆత్మ రామ్ పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు తెలియజేశారు.
ఆత్మ రామ్ తన కొడుకు ఆరోగ్య పరిస్థితి బాగా లేనందువల్ల నవరాత్రుల లో భాగంగా దేవుడు కి మొక్కు బడి ఉండగా, ప్రస్తుతం ఆత్మారాం కొడుకు ఆరోగ్య పరిస్థితి కుదుట పడడంతో, తన నాలుకను కత్తిరించుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించాడని ఆత్మ రామ్ తండ్రి తెలియజేశారు. అయితే ఇదే తరహాలో మరో ఘటన యూపీలోని కురార గ్రామంలో చోటు చేసుకుంది.49 ఏళ్ల రుక్మిణి మిశ్రా కోకేశ్వర్ అనే వ్యక్తి శివాలయంలో ఏకంగా కత్తితో తన గొంతును కోసుకున్నాడు.తీవ్ర రక్తస్రావంతో గాయపడిన అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.దేవుడిపై భక్తి కన్నా వీరిలో మూఢ నమ్మకాల ప్రభావం ఎక్కువగా ఉండటంవల్ల ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారు.ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి ఏకంగా తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారనీ పోలీసులు తెలియజేశారు.