పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా నగరంలోని ఒక డాబాలో ఒక వ్యక్తి తందూరి రోటీ చేస్తూ ఒక పాడు పని చేశాడు.ఈ నీచుడు రొట్టెలు చేస్తూ వాటిపై ఉమ్ము వేస్తూ కెమెరాకు చిక్కాడు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు స్థానికులతో పాటు యావత్ భారతదేశ ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.ఉమ్ము వేసి నీచాతి నీచమైన పని చేస్తున్న ఈ వ్యక్తిని బొక్కలు విరగ్గొట్టేటట్లు తన్నినా తప్పు లేదని పటియాలా నగరవాసులు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు.
ఈ క్రమంలో శరణ్ వాలా గేట్ సమీపంలో ఉన్న ఈ డాబా వద్దకు చాలా మంది స్థానిక ప్రజలు వెళ్లి యజమానిని నిలదీశారు.మరికొందరు ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు.
దీంతో బరిలోకి దిగిన అధికారులు రైడ్ చేసి ఈ విషయం ఏంటో తేల్చాలని డాబాకు వెళ్లారు.కానీ ఆ సమయంలో డాబా క్లోజ్ చేసి ఉండటంతో వెనుదిరిగారు.
మళ్లీ రైడ్ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని అధికారులు వెల్లడించారు.డాబా ఓనర్ మాత్రం సదరు వంటగాడిని వెనకేసుకొస్తున్నాడు.
అతడు నిజంగా ఉమ్మివేయడం లేదని కాకపోతే రొట్టెలు చేసేటప్పుడు అలా ముందుకు వంగడం.చపాతీపై పిండిని నోటితో ఊదటం తనకు అలవాటు అని ఓ దిక్కుమాలిన సమర్థత ఇస్తున్నాడు.
వైరల్ అయిన వీడియోలో మాత్రం అతడు తందూరి చపాతీలపై ఉమ్మి వేస్తున్నాడని స్పష్టంగా కనిపిస్తోంది.
ఒక వ్యక్తి వీడియో తీస్తుండగా ఆ వీడియో వైపే చూస్తూ ఈ వంటగాడు తందూరి రోటీ పిండిని చపాతీలాగా చేస్తూ దానిపై ఉమ్ముతూ కనిపించాడు.36 సెకన్ల పాటు సాగిన ఈ వీడియోలో అతడు కనీసం పది రొట్టెల పైనైనా ఉమ్మి వేశాడు.చపాతీ పై ఉన్న ఎక్స్ట్రా పిండిని వదిలించాలంటే చేతితో దులిపినా పోతుంది.
ఒకవేళ నోటితో ఊదాలన్నా అది వేరేలా కనిపిస్తుంది.కానీ ఇతడు నిజంగానే ఉమ్మి వస్తున్నట్టు కనిపిస్తోంది.
అందుకే నెటిజన్లతో పాటు అధికారులు కూడా ఈ ప్రమాదకర చేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒమిక్రాన్ నేపథ్యంలో ఇలాంటి వీడియోలు ప్రజల్లో మరింత భయాన్ని కలిగిస్తున్నాయి.
ఈ వీడియో తాజాగా నెట్టింట ప్రత్యక్షం కాగా ఇది ఎప్పుడు తీశారు? ఎవరు రికార్డ్ చేశారు? అనేది తెలియరాలేదు.