ప్రస్తుత కాలంలో కొందరు నిజా నిజాలు తెలుసుకోకుండా కేవలం లేనిపోని అనుమానాల కారణంగా తీసుకున్నటువంటి నిర్ణయాలతో కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఓ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకొని కొద్ది రోజులు ఆమె తో కాపురం చేసి చివరికి ఆమెపై లేనిపోని అనుమానాలు పెంచుకొని దారుణంగా హత మార్చిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక నగర పరిసర ప్రాంతంలో రవి అనే యువకుడు నివాసముంటున్నాడు.అయితే ఇతడు ఇదే ప్రాంతంలో నివాసముంటున్న ఈశ్వరమ్మ అనే యువతిని గత కొద్ధి కాలంగా ప్రేమిస్తున్నాడు.
ఇటీవలే తన ప్రేమ విషయాన్ని ఆమెకి చెప్పి ఇరువురి పెద్దల అంగీకారంతో వివాహం కూడా చేసుకున్నాడు.అయితే పెళ్లయిన కొత్తలో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాగా ఈ మధ్య మధ్యానికి బానిస అయినటువంటి రవి తన భార్యపై లేనిపోని అనుమానాలు పెంచుకున్నాడు.అంతేగాక నిత్యం మద్యం సేవిస్తూ ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పడేవాడు.
అయితే ఇటీవల మరోమారు తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే విషయంపై గొడవ పడ్డాడు. ఈ గొడవలో మాట మాట పెరగడం వల్ల విచక్షణ కోల్పోయిన రవి వెంటనే తన భార్యని దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు.
అనంతరం భయపడి అక్కడి నుంచి పారిపోయాడు.ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఈ విషయం గూర్చి సమాచారం అందించారు.
స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. అలాగే స్థానికులు మరియు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఈ దర్యాప్తులో భాగంగా పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.