సాధారణంగా మనకు ఎవరైనా ఒక వస్తువు ఇస్తేనే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం.అలాంటిది విలువైన వస్తువు అయితే మరింత జాగ్రత్తగా చూసుకుంటాం.
కానీ ఓ వ్యక్తి స్నేహితుడు వస్తువు అయినప్పటికీ పోతే పోనిలే అన్నట్టు వ్యవహరించాడు.ఫలితంగా 2 కోట్ల రూపాయిల విలువ కారు నాశనం అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.హ్యూయెల్వాకు చెందిన ఒక యువకుడు అలా అలా తిరిగి వచ్చెనందుకు తన ఫ్రెండ్ కారును అడిగాడు.అడిగింది ఫ్రెండ్ కదా అని ఏకంగా తన 2 కోట్ల రూపాయిల విలువైన లంబోర్ఘిని కారును అతనికి ఇచ్చారు.సరదాగా తీసుకున్న ఆ వ్యక్తి ఆ కారును బాధ్యతగా తీసుకోలేదు.
అతివేగంతో ప్రయాణిస్తున్నప్పుడు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పవర్ కంట్రోల్ రూమ్ గోడను గుద్దేశాడు.ఇంకా ఈ విషయాన్ని తన ఫ్రెండ్ కి మాటమాత్రం అయినా చెప్పకుండా అక్కడి నుండి పరార్ అయ్యాడు.
అయితే పవర్ కంట్రోల్కి సంబంధించిన గోడను గుద్దడంతో పోలీసులు కారు నెంబర్ ఆధారంగా యజమానిని పట్టుకొని అరెస్ట్ చేశారు.
అతను డ్రైవ్ చెయ్యలేదన్న వినిపించుకోలేదు.
అనంతరం అతని ఫ్రెండ్ కి ఫోన్ చెయ్యగా అతను ఆస్పత్రి పాలయ్యాడు అని చెప్పారు.దీంతో పోలీసులు ఆస్పత్రికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు.
యజమానిని వదిలేశారు.అయితే ఏకంగా రెండు కోట్ల కారు బూడిదలో పోసిన పన్నీరు అవ్వడంతో అతను బాధపడుతున్నాడు.
ఇంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.