ఒక భార్య భర్త తనను హింసలకు గురిచేస్తున్నాడు అని కోర్టు మెట్లు ఎక్కింది.అయితే ఇంతకీ ఎదో తాగొచ్చి కొడుతున్నాడనో, లేదంటే అదనపు కట్నం తెమ్మంటూ చిత్ర హింసలకు గురిచేయడం వంటి వి కాదు వింతగా తాను లావుగా ఉన్నానని నా భర్త నన్ను పట్టించుకోవడం లేదంటూ కోర్టు ని ఆశ్రయించింది.
నిజంగా ఈ విషయం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.ఒక భార్య ఎవరైనా నా భర్త వేరొకరితో సంబంధం పెట్టుకున్నాడు అనో,లేదా కట్నం ఇవ్వలేదని వేధింపులకు గురిచేస్తున్నాడు అంటూ కోర్టును ఆశ్రయించిన ఘటనలు చాలానే విని ఉంటాం.
కానీ ఇది మాత్రం భిన్నంగా భార్య లావుగా ఉందని భర్త నన్ను పట్టించుకోవడం లేదంటూ ఆ భార్యే భర్త కు వ్యతిరేకంగా కోర్టుకు ఎక్కడం విశేషం.తాను లావుగా ఉన్న కారణంగా భర్త తనను బయటకు గానీ,పార్టీలకు కానీ తీసుకొని వెళ్లడం లేదని, అలానే మద్యం తాగాలని ఒత్తిడి చేస్తున్నాడు అంటూ ఆ బాధిత మహిళ తన పిటీషన్ లో పేర్కొంది.
అయితే యూపీ కి చెందిన ఆ మహిళ పిటీషన్ చూసిన కోర్టు తొలుత అవాక్కైనా అనంతరం పిటీషన్ ను విచారణకు స్వీకరించినట్లు తెలుస్తుంది.
ఉత్తర్ప్రదేశ్లోని బిజ్నూరుకు చెందిన మహిళకు మీరట్ నగరానికి చెందిన ఓ యువకుడితో 2014లో వివాహమైంది.
ప్రస్తుతం ఆ దంపతులు ఘజియాబాద్లోని ఇందిరాపురంలో నివాసముంటున్నారు.అయితే తాను లావు గా ఉన్న కారణంగా తన భర్త పట్టించుకోవడం లేదంటూ కోర్టు ను ఆశ్రయించింది.