డైనమిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఐ చిత్రం ఇప్పటికే ఆడియో వేడుకని వైభవంగా జరుపుకుని రానున్న సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్దంగా ఉంది.రకరకాల గెటప్స్ తో ఏమీ అర్ధం కాకుండా ఉన్న ఈ సినిమా కధపై ఎవరికి వారు సొంత కధలు అల్లేసుకుంటున్న సమయంలో ఈ చిత్రం యొక్క సస్పెన్స్ లీక్ అయ్యింది అన్న వార్తలు సినీ పరిశ్రమలో హల్చల్ చేస్తున్నాయి.
ఇక ఈ లీక్ కు కారణం ఎవరంటే.ఆ సినిమా ఫోటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ అని తెలుస్తుంది.
ఈ మధ్య ఒక ప్రముఖ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాటల మధ్యలో పొరపాటున ఈ స్టొరీ లైన్ పిసి శ్రీరామ్ లీక్ చేసాడు అని తమిళ తంబీలు చెబుతున్నారు.ఇక లీక్ అయిన కధ ప్రకారం ఈ చిత్రంలో విక్రమ్ మానవ మృగంగా మారడం వెనుక ఈ సినిమా విలన్ ప్రయోగించిన వైరస్ ప్రధాన పాత్ర వహిస్తుంది అని ఫోటో గ్రాఫర్ శ్రీరామ్ అన్న మాటలను బట్టి ఈ సినిమా స్టోరీ లైన్ అల్లేశారు అని అంటున్నారు.
ఒక సాధారణ యువకుడైన ఈ సినిమా హీరో విక్రమ్ ఒలింపిక్ క్రీడలలో బంగారు పతకం సాధించే నేపధ్యంలో అడుగడుగునా విలన్ తాను కనిపెట్టిన వైరస్ ద్వారా చేసే ప్రయోగాలతో విక్రమ్ రకరకాల గెటప్ లకు మారిపోతాడని పిసి శ్రీరామ్ చెప్పినట్లు పుకార్లు చికార్లు చేస్తున్నాయి.అయితే ఈ విషయం తెలిసిన శంకర్ మాత్రం లోలోపల హ్యాపీగానే ఉన్నాడని తెలుస్తుంది దానికి కారణం ఈ లీక్ సినిమా పబ్లిసిటీకు ప్లస్ గా మారుతుందని ఆయన ఆశ.మరి చూడాలి ఈ పుకార్లు ఎంతవరకు నిజమవుతాయో.