చైనా లో దారుణ ఘటన చోటుచేసుకుంది.ఎవరో గుర్తు తెలియని దుండగుడు చిన్నారులపై ప్రమాదకరమైన కాస్టిక్ సోడా తో దాడికి దిగినట్లు తెలుస్తుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చైనా లోని కేయుఆన్ నగరంలో ఒక పాఠశాల లోకి ఒక గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించి వారిపై కాస్టిక్ సోడా తో దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది.మధ్యాహ్నం 3:30గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.అయితే ఈ ఘటనలో మొత్తం 54 మంది గాయపడగా,వారిలో 51 మంది చిన్నారులే ఉండడం గమనార్హం.అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు,ఏంటి అన్న వివరాలు మాత్రం వెల్లడికాలేదు.
కిండర్ గార్డెన్ చిన్నారులపై అతడు సోడియం హైడ్రాక్సయిడ్ ను చల్లడం తో వారంతా కూడా మంటలకు అల్లాడిపోయారు.
మొత్తానికి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకి చేరుకొని చిన్నారులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.అయితే సమాజం పట్ల కోపం తోనే ఆ నిందితుడు ఇలాంటి ఘోరానికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.