దారుణం: భూమి కోసం మహిళపై గొడ్డలి తో...

చిన్న చిన్న తగాదాలకే దారుణాలకు పాల్పడుతున్నారు.కేవలం ఒక్క భూ తగాదా కారణంగా ఒక మహిళ పై ఏకంగా గొడ్డలితో దారుణానికి ఒడిగట్టారు.

 Man Attacked On Woman With Knife For Land Issue In Wanaparthy, Wanaparthy, Knife-TeluguStop.com

ఈ దారుణ తెలంగాణా రాష్ట్రం వనపర్తి జిల్లా లో చోటుచేసుకుంది.భూ తగాదాలతో గత కొద్దీ రోజులుగా రెండు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది.

ఆ గొడవ కాస్త ముదరడం తో ఒక మహిళ పై అత్యంత పాశవికంగా గొడ్డలితో దాడికి తెగబడ్డాడు.వివరాల్లోకి వెళితే.

వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం లోని బుద్దారం గ్రామం లో అర్జున్ రావు అనే వ్యక్తి కి, రత్నమ్మ అనే మహిళ కుటుంబానికి గత కొంత కాలంగా భూతగాదాలు జరుగుతున్నాయి.

భూమి విషయంలో తరచూ గొడవ పడుతుండగా తాజాగా మరోసారి ఈ రోజు (బుధవారం) వారి మధ్య భూమి విషయంలో గొడవ జరగడం తో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ముదిరి అర్జున్ రావు దంపతులు అయిన రత్నమ్మ, అనంతరాములు పై విచక్షణారహితంగా గొడ్డలి తో దాడికి దిగాడు.

అయితే ఈ క్రమంలో రత్నమ్మ పై సదరు అర్జున్ రావు విచక్షణారహితంగా అత్యంత దారుణంగా ఇష్టానుసారంగా దాడి చేశాడు.గొడ్డలి తో రత్నమ్మ మెడపై పదే పదే నరుకుతున్న సమయంలో అక్కడే పలువురు ఉన్నప్పటికీ నిందితుడిని మాత్రం ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదు సరికదా ఈ దృశ్యాలను ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.

ఆ దృశ్యాలను చూడడానికి అత్యంత భయకల్పితంగా ఉన్నాయి.జనాల కళ్ల ఎదురుగానే ఇంత దారుణంగా నిందితుడు ప్రవర్తిస్తున్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా అడ్డుపడకపోవడం గమనార్హం.

అయితే ఈ ఘటన లో తీవ్రంగా గాయపడ్డ రత్నమ్మను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

దాడికి పాల్పడ్డ అర్జున్‌రావును ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube