సికింద్రాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.ఒక అపార్ట్ మెంట్ లో చిన్నారి పై ఒక వ్యక్తి విచక్షణారహితంగా ప్రవర్తించిన తీరు విమర్శల పాలవుతుంది.
సికింద్రాబాద్ అల్వాల్ లో కాంతారావు అనే వ్యక్తి అపార్ట్ మెంట్ నుంచి వెళుతున్న సమయంలో తన కారుకు అడ్డంగా వచ్చాడని ఒక చిన్నారిని విచక్షణారహితంగా చావబాదడం దారుణం.కేవలం కారుకు అడ్డం వచ్చాడన్న ఒక్క కారణంగా చిన్నారి అని కూడా చూడకుండా అతడు ప్రవర్తించిన తీరు విమర్శల పాలు అవుతుంది.
గాల్లో ఎత్తిమరీ ఆ చిన్నారి పై తన ప్రతాపం చూపించి మరి పిడిగుద్దులు గుద్దాడు.అయితే ఈ ఘటన కు సంబందించిన దృశ్యాలు అన్నీ కూడా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడం తో కాంతారావు ప్రవర్తించిన తీరుపై అందరూ మండిపడుతున్నారు.
కేవలం కారుకు అడ్డం వచ్చిన చిన్న కారణానికి ఆ చిన్నారిపై ఇంతలా పిడిగుద్దులు కురిపించడం ఏంటి అని అపార్ట్ మెంట్ వాసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోపక్క కాంతారావు దెబ్బలకు బెదిరిపోయిన ఆ చిన్నారి ఒళ్లంతా నొప్పులతో ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.
అయితే తన చిన్నారిపై కాంతారావు ప్రవర్తించిన తీరుపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు అందించారు.మరోవైపు అపార్ట్మెంట్ వాసులు కూడా కాంతారావు వైఖరిపై మండిపడుతున్నారు.
చిన్న కారణానికి ఆ చిన్నారి ని మరీ అంతలా కొట్టడం ఏంటని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏదైనా తప్పు చేస్తే చిన్నారికి సముదాయించి చెప్పాల్సిన పెద్ద మనిషి ఇలా విచక్షణారహితంగా ప్రవర్తించిన తీరు మాత్రం అందరినీ ఆగ్రహానికి గురి చేస్తుంది.దీనితో అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
.