గత రెండు రోజులుగా కురుస్తున్న ఫణి తుఫాన్ పెను భీభత్సాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఫణి తుఫాన్ ప్రభావం తో ఒడిశా అతలాకుతలం అయ్యింది.
మరోపక్క శ్రీకాకుళం జిల్లా లో కూడా ఈ ఫణి తుఫాన్ ప్రభావం ఎక్కువగానే ఉంది.అయితే ఈ ఫణి తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్ సీ ఎం మమతా బెనర్జీ తన ఎన్నికల ర్యాలీ లను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఒడిశా లో ఎంటర్ అయిన ఫణి తుఫాన్ బెంగాల్ దిశగా వెళ్లనుంది.ఈ క్రమంలో ఆ రాష్త్ర సి ఎం మమతా బెనర్జీ అప్రమత్తమై అక్కడ తుఫాన్ పరిస్థితులను పరిశీలించనున్నారు ఈ క్రమంలో ఆమె తన ఎన్నికల ర్యాలీ కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు సమాచారం.
ఈ రోజు,రేపు ఆమె నిర్వహించాల్సిన ర్యాలీలను దీదీ రద్దు చేసినట్లు తెలుస్తుంది.మరో పక్క ఈ ఫణి తుఫాన్ ప్రభావం కారణంగా పలు రైళ్లు కూడా రద్దు అయ్యాయి.
దీనితో కోల్ కతా రైల్వే స్టేషన్ లో వందల సంఖ్యలో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు.ఈ తుఫాన్ ప్రభావానికి కోల్ కతా విమానాశ్రయం కూడా మూసివేసినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8:30 నిమిషాల వరకు కూడా అన్నీ దేశీయ,అంతర్జాతీయ విమానాలను అన్నిటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న ఈ ఫణి తుఫాన్ ప్రభావానికి శ్రీకాకుళం,విజయనగరం జిల్లా లు దెబ్బ తిన్నాయి.
మరోపక్క విజయవాడ-విశాఖ పట్నం- భువనేశ్వర్ మధ్య నడిచే రైళ్ల లో కొన్నింటిని రద్దు చేయగా,మరికొన్నింటిని దారి మళ్లించినట్లు తెలుస్తుంది.సికింద్రాబాద్, విజయవాడ డివిజన్ కార్యాలయాల్లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్లను ప్రారంభించిన అధికారులు.
హెల్ప్ లైన్ లను కూడా అందుబాటులో ఉంచారు.