నీతి ఆయోగ్ కు ఆ ముగ్గురు సీ ఎం లు దూరం

ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ఎన్డీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించింది.

 Mamatakcr Are Not Attending The Niti Ayog Meeting-TeluguStop.com

ఈ క్రమంలో నరేంద్ర మోడ్ రెండోసారి ప్రధాని గా ప్రమాణ స్వీకారం కూడా చేశారు.అయితే ఆయన రెండో సారి ప్రధాని గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారిగా ఆయన అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో పాల్గొనడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో పాటు పలు శాఖల మంత్రులు కూడా హాజరుకావాల్సి ఉంది.ఈ క్రమంలో ఇప్పటికే ఏపీ సి ఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్లిపోయారు.

అయితే తెలంగాణా సీ ఎం కేసీఆర్ ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉండగా ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు తెలుస్తుంది.నీతి ఆయోగ్ వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని, కావున ఈ సమావేశానికి హాజరుకానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే.

-Political

అయితే ఇప్పుడు తాజాగా కేసీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు తెలుస్తుంది.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు.అయితే బిజీ షెడ్యూల్‌ కారణంగా.ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నారు.ఇక ఈ ఇద్దరి సీఎంల బాటలోనే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ కూడా చేరారు.ఆయన కూడా సాయంత్రం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube