శివసేన పార్టీ నుండి కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంతో ఉద్దవుతాకిరే ఎటువంటి బల నిరూపణ చేసుకోకుండానే ముందుగానే సీఎం పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.అనంతరం మహారాష్ట్రలో బిజెపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ క్రమంలో ఏర్పడిన ఈ కొత్త ప్రభుత్వం పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో కొలువైన ఏకనాధ్ షిండే..దేవేంద్ర ఫడ్నవిస్ కూటమి త్వరలో పడిపోతుందని పేర్కొన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగుతుందని తాను భావించటం లేదని స్పష్టం చేశారు.అది అనేక మరియు అప్రజాస్వామీక.
ప్రభుత్వమని మండిపడ్డారు.మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని వాళ్లు ఏర్పాటు చేసి ఉండొచ్చేమో కానీ.
ప్రజల హృదయాలను గెలవలేకపోయారు అంటూ…ఏకనాధ్ షిండే… దేవేంద్ర ఫడ్నవిస్ కూటమి ప్రభుత్వంపై.మమతా బెనర్జీ మండిపడ్డారు.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆరు నెలలలో కూలిపోవడం గ్యారంటీ అని అన్నారు.అధికార దుర్వినియోగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణిచివేయోచ్చేమో కానీ.
అదే ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించి ప్రజలు మిమ్మల్ని కిందకి దింపుతారని మమతా బెనర్జీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.