2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నాయకత్వంలో యూపీఏ రెండుసార్లు దేశాన్ని పాలించడం తెలిసిందే.యూపీఏ ఆధ్వర్యంలో దేశంలో అనేక పార్టీలు భాగస్వాములుగా ఉండటం జరిగాయి.
ఇటువంటి తరుణంలో ఆనాటి పొత్తులు ప్రస్తుత పరిస్థితిలో కొనసాగాలంటే కష్టమేనని జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.ఈ దిశగానే తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఈరోజు శరద్ పవార్ తో భేటీ అయిన తర్వాత మీడియాతో.మమతా బెనర్జీ మాట్లాడుతూ.
యూపీఏనా ఎక్కడ ఉంది.ఇంకా ఉందా.? అంటూ ఎటకారం అయిన ప్రశ్నలు వేశారు.యూపీఏ.
అనేది ఎప్పుడో అంతరించి పోయింది దానికి సంబంధించి ప్రస్తుతం ఏమీ లేదు.అంటూ కొత్త ఫ్రంట్ రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు
వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏకి దీటుగానే.
కొత్త కూటమి ఏర్పడే అవకాశం ఉందని.ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు కీలక నాయకులు వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇటువంటి తరుణంలో మమతాబెనర్జీ కొత్త ఫ్రంట్ వస్తున్నట్లు వ్యాఖ్యలు చేయడం జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ని టార్గెట్ చేసుకునిమమతా బెనర్జీ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ఉంది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.బెంగాల్ లో మాత్రమే కాక పలు రాష్ట్రాలకు వ్యాప్తి చెందే విధంగా చక్రం తిప్పుతూ ఉంది.
ఇదిలా ఉంటే ఇదే మీడియా సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో కచ్చితంగా పోరాడాలని పోరాడటానికి ఆసక్తి చూపించకపోతే ఎవరూ ఏమీ చేయలేరని.మమతా బెనర్జీ స్పష్టం చేశారు.