యాస్ తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఒడిషా, బెంగాల్ ముఖ్య మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో… యాస్ తుఫాను రాబోయే గంటల్లో తీవ్ర తరం నుండి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉండటంతో.
రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ముందస్తు జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు.అదే రీతిలో తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి ముందస్తు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆంధ్ర, ఒడిసా రాష్ట్రాలకు 600 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కేవలం 400 కోట్లు కేటాయించటం తో.బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అంటే ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు అని ప్రశ్నించారు.
ఆంఫాన్ తుఫాన్ కంటే యాస్ తుఫాను. అత్యంత ప్రమాదకరమని.
గత తుఫాన్ నిధులు ఇంకా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.అదే రీతిలో దేశంలో అతిపెద్ద రాష్ట్రం పైగా ఎక్కువ జనాభా కలిగిన పశ్చిమ బెంగాల్ పట్ల కేంద్రం ఎందుకు ఈ రీతిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు అంటూ తాజాగా కేంద్రం పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి నాలుగు వందలు కోట్లు కేటాయించటం పై మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు.