పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, కేంద్రానికి అసలే పడదన్న విషయం అందరికి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే ఒకరి పై ఒకరు ఊహించని స్దాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.
అందులో పశ్చిమ బెంగాల్ లో జరగనున్న ఎన్నికల నేపధ్యంలో అయితే ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు నిప్పులో ఉప్పులా చిటపటలాడుతుంది.
ఇకపోతే మమత పై ఎన్నికల కమిషన్ ఒకరోజు నిషేధం విధించిన విషయం తెలిసిందే.
నిషేధ అనంతరం మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దీదీ ఎప్పటిలాగే ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు.బెంగాల్ ప్రజలకు తాను ఏం చేయలేదని మోడీ అంటున్నారని, కానీ తాను చేసింది నిరూపిస్తే ఆయన గుంజీలు తీస్తారా? అని సవాల్ విసిరారు.
అదీగాక ఆయన ఓ అబద్దాల కోరు అంటూ విమర్శించారు.నాపై వేసిన నిందలు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ వ్యాఖ్యానించారు.
ఇక ఈ మాటల యుద్ధం కోల్కతాకు సమీపాన ఉన్న బరసత్ లో మంగళవారం రాత్రి జరిగిన ఎన్నికల ర్యాలీలో చోటు చేసుకుందట.