ఎక్కడైనా తమతో ఉంటూ తమకు వెన్నుపోటు పొడిచే వాళ్లు చాలా మంది ఉంటారు.ధనానికి ఆశపడి తమకు అన్నం పెట్టిన వారినే మోసం చేస్తున్న సమాజం ఇది.
ఇలాంటివి ఎక్కువగా రాజకీయాలలో కనిపిస్తుంటాయి.ఎంతోమంది రాజకీయ నాయకుల వెంట ఇతర నాయకులు వెన్నంటే ఉండి వాళ్లను నమ్మించి వాళ్ల సమాచారాలను ఇతర పార్టీలకు తెలియజేయడం వంటివి చేస్తుంటారు.
కానీ వాళ్ళ నిజస్వరూపం తెలుసుకోకుండా ఉన్న నాయకులు చివరికి మోసపోతుంటారు.తాజాగా మరో రాజకీయ నాయకురాలు మమతా బెనర్జీ ఇలాంటి వెన్నుపోటునే ఎదుర్కొంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అధికారి కాంతి దక్షిణ్ లో ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా ఆమె అధికారి కుటుంబం తనపై విమర్శలు గుప్పించారు.కొన్నాళ్ల కిందట సువేందు అధికారి బిజెపీ లో చేరాడు.
ఇక తాజాగా ఆదివారం ఆయన తండ్రి టీఎంసీ ఎంపీ శిశిర్ అధికారి కూడా కాషాయ కండువాతో బిజెపి లో చేరారు.
అంతేకాకుండా పూర్భ మేదినీపూర్ జిల్లాలో ఆ అధికారి కుటుంబం దాదాపు రూ.5 వేల కోట్ల సామ్రాజ్యాన్ని అక్రమంగా నిర్మించుకున్నారని మమత బెనర్జీ తెలిపింది.ఒకవేళ తాను మళ్లీ అధికారంలోకి వస్తే వాళ్ళ ఆస్తుల పై ఉన్న విచారణలు జరుపుతానంటూ స్పష్టం చేసింది.
ఇక ఈ జిల్లాలో వారి కుటుంబానికి మంచి పట్టు ఉందంటూ.అందుకే ఈ కుటుంబంలో చాలామంది బిజెపిలో చేరడానికి అవకాశం ఉందని తెలిపింది.ఇక తనతో వెంట వాళ్ల నిజస్వరూపాలు గుర్తించలేకపోయినా ‘పెద్ద గాడిదను నేను’ అంటూ మమత బెనర్జీ తనని తాను విమర్శించుకుంది.రూ.5 వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఆ కుటుంబం నిర్మించుకున్న సంగతి తనకు తెలియదని తెలుపుతూ ఇక ఆ డబ్బుతో ఓట్లు కొంటారని చెప్పుకొచ్చింది.ఇక ప్రజలతో మీరు వాళ్ళకు ఓట్లు వేయొద్దు అంటూ గట్టి పిలుపునిచ్చింది.