పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నందిగ్రామ్ నియోజకవర్గం నుండి మమతా బెనర్జీ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.మమతా బెనర్జీ పై ఈ నియోజకవర్గంలో బిజెపి పార్టీ నాయకుడు సువేంద గెలవడం జరిగింది.
ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేస్తూ కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీ పిటిషన్ దాఖలు చేయటంతో.పాటు పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు తాజాగా.
ఎన్నికల కమిషన్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది.
రాష్ట్రంలో అన్ని చోట్లా చాలావరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన.
కీలకమైన ఈ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడంతో.పాటు మమతా బెనర్జీ ఓటమి పాలవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
దీంతో తాజాగా నందిగ్రామ్ ఎన్నికలలో తన ఓటమిని సవాల్ చేస్తూ న్యాయస్థానంలో మమతా వేసిన పిటిషన్.లో తనపై గెలిచిన సువెంద ఎన్నిక చెల్లదని స్పష్టం చేశారు.
ఎన్నికలలో.సువెంద కొంత మంది అధికారులకు లంచం ఇవ్వటం జరిగిందని కుల, మతాల పేర్లతో రెచ్చగొట్టారని.
బూత్ క్యాప్చర్ జరిగిందని.మమత ఆన్లైన్ ద్వారా న్యాయస్థానానికి తెలిపారు.
ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో దిది వేసిన పిటిషన్ న్యాయస్థానం విచారణకు స్వీకరించడం తో పశ్చిమబెంగాల్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.
.