రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ముసురుకుంటుందట.అయితే నీళ్లు, నిధుల కోసమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం.
కానీ నిధులు ఎవరి పాలవుతున్నవో యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలుసట.ఇక నీళ్ల విషయంలో ఇప్పటి వరకు మీనవేషాలు లెక్కిస్తుందని కారు పార్టీ దుమ్ము దులిపేస్తున్నాయి ప్రతిపక్షాలు.
ఈ క్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.ఇన్ని సంవత్సరాల నుండి నీళ్ల విషయాన్ని నీరు గార్చిన మంత్రి వర్యులు ఇప్పుడు సడెన్గా రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు యుద్ధం చేస్తామనడం విడ్డూరం అంటూ ఎద్దేవా చేశారు.
ఇకపోతే నీళ్ల విషయంలో ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవకముందే తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ కేసీఆర్ పెడచెవిన పెట్టి ఇప్పుడే నిద్రలో నుండి లేచి వచ్చినట్లుగా ఇంతకాలం ఏం జరుగుతుందో తెలియనట్లుగా మాట్లాడటం హస్యాస్పదం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదీగాక నీటి కోసం సాధించుకున్న తెలంగాణలో కృష్ణా నది నుంచి ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని మరి ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో ఇప్పటి వరకు ఏం చేస్తున్నారో ప్రజలకు వివరణ ఇవ్వవలసిన బాధ్యత ఉందని గుర్తుచేశారు.