ఏదైనా పండుగలు ప్రత్యేక రోజులు ఉన్నాయంటే బుల్లితెర కార్యక్రమాలు ప్రత్యేక ఈవెంట్లను ప్రసారం చేస్తూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి.ఈ క్రమంలోనే రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్లెమాలవారు హలో బ్రదర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అక్కచెల్లెళ్లతో అన్నాతమ్ములకు రాఖీలు కట్టించి పెద్ద ఎత్తున ఈ పండుగను సెలబ్రేట్ చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు బుల్లితెర నటీనటులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కు బుల్లితెర నటీనటులు మల్లెమాల టీం ఘన నివాళి అర్పించారు.ఉదయ్ కిరణ్ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగారు అలాగే అంతే తక్కువ సమయంలో ఆయన కెరియర్లో ఇబ్బందులు ఎదుర్కోవడం చివరికి జీవితాన్ని కోల్పోవడం మనకు తెలిసిందే.
ఈయన మరణ వార్త తలుచుకుంటే ఇప్పటికీ అభిమానులను కలిచి వేస్తుంది.ఈ క్రమంలోనే బుల్లితెర నటుడు ఉదయ్ కిరణ్ జీవిత చరిత్ర గురించి ఒక పాట రూపంలో తెలియచేశారు.
ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలోకి ఏ విధంగా వచ్చారు ఆయనకు ఎలా అవకాశాలువచ్చి ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎదిగి అనంతరం ఆయనకు అవకాశాలు లేక ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొని చనిపోయారో కళ్ళకు కట్టినట్టు చూపించారు.
ఇలా ఉదయ్ కిరణ్ గురించి తెలియజేయడంతో అక్కడున్న వారందరూ కంటతడి పెట్టుకున్నారు.ఇకపోతే మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ చెల్లెలుగా నటించిన నటి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఆమె ఉదయ్ కిరణ్ ను తలుచుకొని ఎమోషనల్ అవుతూ మనసంతా నువ్వే సినిమా సమయంలో ఉదయ్ కిరణ్ తనతో అన్న మాటలను గుర్తు చేసుకుని అందరిని ఏడిపించారు.
మనసంతా నువ్వే సినిమా ఫస్ట్ డే షూటింగ్లో ఉదయ్ కిరణ్ తనతో మాట్లాడుతూ నువ్వు మీ ఇంట్లో మీ అన్నయ్యతో ఎలా ఉంటావో, ఎలా మాట్లాడుతారో నాతో కూడా అలాగే ఉండు అంటూ చెప్పారని ఈ సందర్భంగా ఆమె ఉదయ్ కిరణ్ అన్న మాటలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.ఈ విధంగా మల్లెమాలవారు ఉదయ్ కిరణ్ కు ఘనంగా నివాళులర్పించారు.