మూడు రాజధానుల ప్రకటన ఏపీలో రాజకీయ పార్టీలకు ముప్పుతిప్పలు తీసుకు వస్తున్నాయి.ప్రాంతాల వారీగా నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఇప్పటికే పార్టీ కట్టుబాట్లను సైతం పక్కన పెట్టి జగన్ నిర్ణయాలకు జై కొడుతున్నారు.తాజాగా ఇవే అంశాలను ప్రస్తావిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలుగుదేశం పార్టీపై సెటైర్లు వేశారు.
రాజధాని అంశంతో టిడిపి మూడు ముక్కలయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు.ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నమాటలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తల ఎక్కడ పెట్టుకుంటారు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.
రాయలసీమలోని తెలుగుదేశం నాయకులు జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తామంటే బాబు ఆయన కొడుకు మాత్రం రాద్ధాంతం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైయస్సార్ సీపీ రైతు పక్షపాత పార్టీ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
రాజధాని అంశంపై ఇంత ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబు అమరావతిలో ఇప్పటి వరకు ఒక్క శాశ్వత కట్టడమైన నిర్మించారా అంటూ ప్రశ్నించారు.రాజధాని పేరు చెప్పుకుని తెలుగుదేశం నాయకులు దాదాపు నాలుగు వేల ఎకరాల మేర ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు.
కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు ఉద్యమాల పేరుతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.